బృందావని లో ...... నంద కిశోరా
నీ రాకకై వేచెను రా. ..
చల్లని గాలి వీచినా
నీ ధ్యాసే,
చిగురాకు కదిలినా
నీ ధ్యాసే
నా మది చేసే వేణు గానము
నీ హృదయము తో
నువు వినలేదా...
విరహముతో తపించు
నా మనసు బాధ
నువు కనలేవా
కృష్ణా..
.......కానగ రావా...
చిరుగాలి కి ఊసులాడు
చిగురాకుల సవ్వడి చిరు
సందడి చేస్తుంటే
ఘాము గడిచినా
నీ జాడ లేక
వెన్నెలంతా వేలవెల పోతుంటే
అదురు, బెదురుల
లేడి కన్నుల లా
నీ రాక కై ఎదురు చూస్తున్న
కన్నుల నిండుగా
వెలుగులు నింపగ
కాన రావేల... కృష్ణా..
ఇంత జాగేలా...
రచన..ఆచంట గోపాలకృష్ణ

No comments:
Post a Comment