Saturday, 17 February 2018

మన్యం లో " పులి " కథ


మన్యం లో " పులి " కథ 
ఈ దారి లో వెడితే తొందరగా అడవి దాటొచ్చు అనుకున్నాను కానీ తప్పు చేశా నెమో అనిపిస్తోంది...ఇప్పుడు ముందుకి వెళ్లాడమే ,తప్పదు ,అనుకుంటూ,
అతడు నెమ్మది గా అడుగు లో అడుగు వేసుకుని నడుస్తున్నాడు.వీరబాబు ..చిమ్మ చీకటి... అసలే అడవి వెన్నెల వెలుగు కూడా పడట్లేదు ....చేతిలో 
లాంతరు వెలుగు తప్ప ఇంకేమి కనిపించట్లేదు. భయం భయం గా  అడుగులు వేస్తున్నాడు. అడుగుల శబ్దం అతనికే వినిపిస్తోంది.కీచు రాళ్లు చప్పుడు భయాంకరం గా ఉంది..ఊ అంటూ...
.నక్క ల ఊళలు , మరింత భయాన్ని పెంచుతున్నాయి ...అతని అడుగుల కుఆకులు నలిగి కిర్ కిర్ మని చప్పుడు చేస్తున్నాయి. ఒక రకమైన  భయంకరమైన నిశ్శబ్ద వాతావరణం....అడుగుల చప్పుడు తప్ప ఇంకేమి విన్పించట్లేదు .అంతలో ఏదో పరుగెత్తి మీదకి వస్తున్నట్లు నట్లు శబ్దం వినిపించింది..ఒళ్ళంతా ఝల్లుమంది.  అంతే ఆగి పోయాడు.... వచ్చేసింది పులి అని ఇంక అయిపోయింది అంతా అనుకున్నాడు. నెమ్మది గా అడుగుల శబ్దం  తన వైపు కె వస్తోంది....వచ్చేసింది... వచ్చేసింది ...మీద పడిపోతోంది అనుకుని ...భయం భయం గా చూస్తున్నాడు.... లాంతర్ వెలుగు లో కనిపించింది ...ముళ్ల పంది..... పరిగేట్టుకుంటూ..ప్రక్కనించి ..వెళ్లి పోయింది...దాని వెనకే నక్క ...పరిగెత్తింది... హమ్మయ్య ...అనుకుంటూ... ముందుకు వడి వడి. గా నడువసాగాడు....కొంత దూరం ప్రయాణించిన తరువాత....ఇంకో ఐదు నిమిషాలలో అడవి దాటేస్తా ను ఇంక ఏ భయం ఉండదు....ఇంకెప్పుడు ఈ దారిలో రాకూడదు అనుకున్నాడు.....వీరబాబు..
ఇంతలో హఠాత్తుగా , చెట్ల మీద పక్షులు అరుస్తూ ఎగిరాయి... రెక్కల రెపరెపల 
శబ్దం ,కీచు కీచు మని భయంకరంగా 
అరుస్తున్నాయి ...,ఏదో ప్రమాదం రాబోతోంది అని..సంకేతం .....అతనికి తల లోనించి  చెంప మీదుగా ...చెమట చుక్క కారడం మొదలు పెట్టింది...అతనికి తెలిసి పోయింది  ... అక్కడే పులి ఉందని, అడుగుల వేగం పెంచాడు .....హటాత్తుగా , చెట్టు చాటు నుండి మెరిసే కళ్ళని చూసాడు స్థాణువు లా నిలబడి పోయాడు.భారీగా అడుగు వేసుకుంటూ ఠీవీగా అతని ముందుకి వచ్చేసింది....గాండ్రిస్తూ...గుర్రు గుర్రు మని శబ్దం వస్తోంది దాని నొట్లొనించి...
అతని ముందు కూర్చుంది... స్థాణువు లా నిలబడిపోయాడు... అతనిని 
చూస్తోంది. రెప్ప పాటు కాలం లో  పరిగెత్తి చెట్టు ఎక్కాలనుకున్నాడు. 
కదాలగానే... ఒక్క ఉదుటున ఎగిరి ....ఒడిసి పట్టేస్తుంది. 
ఏమి  చేయాలో అర్థం కావట్లేదు....వళ్ళంతా చెమటలు పట్టేశాయి...పులి.... అక్కడే.....అలాగే  కూర్చుంది...తీక్షణంగా చూస్తోంది... చేతిలో లాంతరు ఉంది అని గుర్తుకు వచ్చింది.. కింద ఎండి పోయిన పుల్లలు పడి ఉన్నాయి..అవి వెలిగిస్తే ఆ మంట కి బెదరవచ్చు అనుకుంటూ... ఉండగా ..అంతలో...పులి... లేచింది ..అడుగు వెనక్కి  వేసింది..అంటే ఇంక దూకేస్తుంది అన్నమాట....ఈ లోపు మంట ..వెలిగించాలి.. అనుకుని.. నెమ్మది గా పుల్లలని కాలితో తోసాడు... 
లాంతరు మూత తీసి పుల్లల మీద పడేసాడు..పులి ముందుకి అడుగు ముందుకి వేసింది... మీదకి ఉరకడానికి ఎగిరింది.... కానీ లాంతరు , కిరోసిన్ ఆయిల్ ,వల్ల మంటలు రేగి..ఒక్కసారిగా పైకి ....ఎగిసాయి.త ల మీద రెండు చేతులు అడ్డుగా పెట్టుకుని కింద కూర్చుండి పోయాడు.. పులి  ఆ మంటలను తప్పించుకుని ,అతన్ని దాటుకుని మీదనుంచి వెనకే వస్తున్న దుప్పి మీదకు దూకి,  దాన్ని ఒడిసి 
పట్టుకుని ...అడవి లోకి  లాక్కుని వెళ్ళిపోయింది....ఒక్క క్షణం ఏమి జరిగిందో 
అర్థం కాలేదు.... మళ్ళీ వస్తుంది ఏమో నని
మంట పెద్దది చేసి ...సంచి లో నీళ్లు తీసుకుని గడగడా తాగేసాడు.... అప్పుడు తేరుకున్నాడు.... వెనకాల దుప్పి వచ్చింది కాబట్టి బతికి పోయాను.... లేదంటే... 
ఇంతే సంగతులు అనుకుంటూ... మంటని...ఆర్పేసి.... వేగం గా అడవి దాటేసాడు....    ఇల్లు చేరుకుని....హమ్మయ్య...అనుకున్నాడు.... ఊరి వాళ్ళకి ఈ విషయం  చెప్పాలి....అనుకున్నాడు.... ఇంతలో అతని భార్య వచ్చింది ..ఏమయ్యా ఇంత ఆలస్యం అయింది.... అంటూ పలకరించింది... సంత లో ఆలస్యం ఐయ్యింది లే...అంటూ లోపలికి నడిచాడు....రాజు
‌ పులిని వేటాడడము లో బాగా ప్రావీణ్యము కలిగినవాడు... అందుకే రాజు కు ఈ విషయం చెప్పాలి
అనుకు న్నాడు .మరునాడు పొద్దున్నే రాజు ఇంటికి వెళ్ళాడు. రా రా  వీరబాబు పొద్దున్నే ఇలా వచ్చావు , ఏమిటి సంగతి అని అడిగాడు.రాజు భార్య ఇద్దరే ఉంటారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తల్లి తండ్రులు దగ్గరకి రానివ్వలేదు... 
అందుకే దూరం గా వచ్చి ఆ గ్రామం లో వ్యవసాయం చేస్తూ జీవనం 
సాగిస్తున్నాడు. అది అసలు ఏమి జరిగిందంటే అంటూ ముందు రోజు జరిగినది అంతా చెప్పాడు...వీరబాబు అయితే మళ్ళీ కొత్త పులి మన ఏరియా లోకి వచ్చింది అన్నమాట...మళ్ళీ మనం జాగ్రత్తగా ఉండాలి... ఊళ్ళో చెప్పాలి... జాగ్రత్తగా 
ఉండాలి అని...చీకటి వేళలో...ఎవరూ అడవి లోకి వెళ్లద్దు అని చెప్పాలి  
అన్నాడు..రాజు... అలాగే ..నేను ఊరి వాళ్ళను తీసుకుని వస్తాను ఈ లోగా నువ్వు రచ్చ బండ దగ్గరకి వచ్చేయి... అంటూ బయలుదేరాడు వీరబాబు... రాజు ఆరోజు ఊరి వాళ్ళందరిని సమావేశ పరిచి...జాగ్రత్తలు చెప్పాడు... భయపడాల్సిన అవసరం లేదని నేను చూసుకుంటాను అని చెప్పాడు... పులి ని తరమడానికి డప్పులు, కాగడాలు... బరిసే  లు సిద్ధం చేసుకున్నారు....రాజు ఇంటికి చేరుకోగానే...ఇంట్లో ఏదో శబ్దం వినిపిస్తే ...లోపల ఏమిటా అని చూసాడు...అక్కడ చిన్న పులి పిల్ల గోడవారగా ఉంది..భయం భయం గా చూస్తోంది... ఆకలి మీద ఉన్నట్టుంది... కొంచెం చిన్నగా మూలుగు తోంది... రాజు కి చాలా ముచ్చట వేసింది... ఇదన్న మాట ..సంగతి... .ఈ పిల్లకోసం అది ఊళ్ళోకి వచ్చినా వచ్చేస్తుంది...ఇది దారి తప్పి ఇలా వచ్చేసింది....ముందు దీనికి పాలు పోసి 
చూస్తా...అనుకుని..పళ్లెంలో పాలు పోసి దాని ముందుకు తోసాడు.....అది 
భయంగా చూసి...ఆకలి తో ఉండడం తో పాలు దగ్గరకు వచ్చి తాగడం మొదలు పెట్టింది...తాగేసి ములకి వెళ్లి పడుకుంది. నవ్వుకుని దానిని అలాగే వదిలేసి...వంట కార్యక్రమం మొదలు పెట్టాడు...భార్య నెల తప్పడం తో  పురి టికీ పుట్టింటికి వెళ్ళింది... మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు...ఇంక నీ తోనే 
కాలక్షేపం...మా బాబు వచ్చే సరికి...నిన్ను బహుమతి గా 
ఇస్తాను..అనుకున్నాడు......రాత్రి కూడా కొంచెం అన్నం పాలలో వేసి పళ్లెం దాని ముందు పెట్టి దా తిను అంటూ పిలిచాడు...అది నెమ్మదిగా వచ్చి తినడం మొదలు పెట్టింది.రాజుకుడా వడ్డించుకుని తినడమ్ మొదలు పెట్టాడు.తినేసి మళ్ళీ మళ్ళీ రాజు ని చూడడం మొదలుపెట్టింది.కొంచెం కొంచెం అన్నం వేసాడు పళ్ళెంలో. అదికూడా తింది..., ములకి వెళ్లికూర్చుంది.. ఒక గిన్నె లో నీళ్లు పోసి ఆ ప్రక్కనే ఉంచి... .రాజు చాప వేసుకుని పక్క  సర్దుకుని....నిద్రకి ఉపక్రమించాడు... ఓ రాత్రి వేళ కాళ్ళకి మెత్తగా తగిలింది ఏమిటని చూస్తే కాళ్ళ దగ్గర ముడుచుకొని పడుకొంది... దానిని పక్కలో పడుకోపెట్టుకున్నాడు దుప్పటి కప్పి .....అలా రోజూ అలవాటు అయిపోయింది....ఎక్కడ ఉన్నా రాజు పక్కలో కి వచ్చేస్తుంది....

...చూసి నవ్వుకుని వదిలేసాడు... మరునాడూ పాలుపోసి బైటకు 
వెళ్ళాడు...అతను వచ్చే సరికి ...తోక ఊపుకుంటూ వచ్చి కాళ్ళ లో కి దూరిి..ఆడడము మొదలు పెట్టింది..అలా అలవాటు అయ్యింది....ఒకరోజు తల్లి తన పిల్ల కోసం ఉరిలోకి వచ్చేసింది... ముందే చెప్పి ఉంచడం వలన ...ఊరి వాళ్ళు దాన్ని తరిమేసారు... రెండు సార్లు ప్రయత్నించి అది అడవిలోకి వెళ్ళిపోయింది....కొన్నాళ్లకు పులి  పిల్ల పెద్దది అవుతుంది.  పెంపుడు జంతువు 
లాగా పెరుగుతుంది...చాలా ప్రేమగా చూసుకుంటాడు రాజు...ఒకరోజు

రాజు స్నేహితుడు అతని ఇంటికి వచ్చాడు .చూడడానికి....బాబు పుట్టాడు అని తెలిసి.....ఎరా రాజు  చెల్లెమ్మ ఇంకా రాలేదా...అని  అడిగాడు...ఈమధ్యనే బాబు పుట్టాడుగా మూడునెలల తరువాత పంపిస్తానన్నారు...మా మావగారు...ఇన్నాళ్లకు కోపాలు పోయి అందరూ కలిశారు ...సరే మీ ఇష్టము అలాగే  మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపండి...మధ్యలో నేను వచ్చి చూసి వెళుతూ ఉంటాను....అన్నాను ...పొలం పనులు కూడా ఉన్నాయి గా..పైగా ఇది కూడా బాగా అలవాటు అయింది.... నేను పెట్టక పోతే తిండి కూడా 
తినదు.....ఒకవేళ వెళ్లినా పొద్దున్నే వెళ్లి రాత్రికి వచేస్తున్న....నువ్వు ఒకపని  చెయ్ ఈ రాత్రి కి ఇక్కడే ఉండు...పొద్దునే వెళ్లుదువు గానిలే.. అసలే అడవి.....చీకటి పడుతోంది , నువ్వు కూరలు...తరుగు తూ ఉండు....నేను ఇప్పుడే వస్తాను....బిరియాని సరుకులు తెస్తాను, బిర్యానీ చేసుకుందాం  అన్నాడు.... సరే... నేను తరుగుతూ ఉంటా నువ్వు త్వరగా వచేయరా బాబు ...అన్నాడు..ఇంకేమి దొరకలేదా దీనిని పెంచుతున్నావు నాకు భయము గా ఉంది అన్నాడు. ఏమి ఫరవాలేదు లే అది నిన్ను ఏమి చేయదు కంగారు పడకు..వెంటనే 
వచేస్తాలే అంటూ పులికేసి తిరిగి ఇక్కడే పడుకో, ఎక్కడికి వెళ్లకు అని దాని 
తలమీద నిమిరి బైటకు వెళ్ళాడు. పులి అక్కడే పడుకుని వుంది.... కూరలు తరుగుతూ ఉండగా, అది అవులిస్తూ ఒకసారి గాండ్రించింది...భయం తో ఉలిక్కి పడ్డాడు...కంగారులో,పొరపాటున చెయ్యి కోసుకు పోఇంది.. ఒక్కసారి అబ్బా అంటూ బాధగా చెయ్యి విదిల్చాడు... ఆ చేతికి కారుతూ ఉన్న రక్తం పులి మొఖం మీద పడింది..గబగబా .. చేతికి తుండు కట్టుకున్నాడు..... పులి ముఖం మీద పడ్డ దానిని నాలిక తో నాకి తుడుచు కుంది.. ఒక్కసారి దానికి రుచి మెదడుకి ఎక్కేసింది. మెల్లగా ..లేచి వచ్చి కిందపడ్డ చుక్క లని నాకింది..... రుచి మరిగింది...
 అతని దగ్గరకి వచ్చి చేతిని వాసన చూసి నోటితో పెట్టేసింది ...అది మాన్ ఈటర్ గా మారిపోయింది.... వాడు అరుస్తూ...కర్రతో ఒక్కటి కొట్టాడు అయినా 
.వదలలేదు....పంజా తో ఒక్కటి వేసింది.. అప్పుడే వస్తున్న రాజు  అతడి అరుపులు విని పరిగెత్తుకు లోపలికి వచ్చాడు..అప్పటికే ... అతని చేతిని సగం తినేసింది. రాజు గన్ తీసి షూట్ చేసాడు.... చేతిని వదిలేసి అడవి లోకి పారిపోయింది..దానిని ఎంతో ప్రేమతో పెంచుకున్నాను... కానీ అది ఇప్పుడు ఇలా మారిపోయింది... అంటూ నిట్టూర్చాడు రాజు... తప్పదు రాజు అది ఇప్పుడు ప్రమాదకరం గా మారిపోయింది... అలాగే వదిలేస్తే చాలా ప్రమాదం... ఎంతమందిని చంపుతుందో తెలియదు... నువ్వు తక్షణం నిర్ణయం తీసుకుంటామని ఆశిస్తున్నాను... అన్నాడు గ్రామ పెద్ద.... అతడికి వైద్యం చేయించి ,ఊరి ప్రజలు అందరూసమావేశమై ...అది ప్రమాదకరం గా మారిపోయింది... కనుక చంపేయాలి.. అని నిర్ణయానికి వచ్చారు.దానిని ఎంత ప్రేమ తో పెంచుకున్నా దానివలన సమాజానికి హానికరమని 
..రాజు కి ఇష్టం లేకపోయినా... తప్పనిసరి పరిస్థితులలో మాటు వేసి 
చంపేసాడు..అచేతనము గా పడి  ఉన్న దానిని ,ప్రేమగా దానిని తల మీద ఒకసారి నిమిరి నీళ్లు నిండిన కళ్ళను తుడుచుకుంటూ ఊరి వైపు నడిచాడు.....

No comments:

Post a Comment